మోడి ప్రభుత్వానికి సుప్రీం చీవాట్లు
హైదరాబాద్: నేరమయ రాజకీయాలపై మంగళవారం ఉదయం అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. ఈ అంశంపై చర్చకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నోటీసులు ఇచ్చాయి. చర్చను ప్రారంభించిన శాసన సభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు నేరుగా కాంగ్రెస్ పార్టీ మీద దాడికి దిగారు. నేరమయ రాజకీయాల విషయంలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలున్నాయన్నారు.
తమకు అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారమే 35 మంది ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నాయని, ప్రజలకు తెలిసి ఇంకా ఎందరో ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. యనమల వ్యాఖ్యలకు సిఎల్పీ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలియజేశారు.
గ్రూపులు తమ పార్టీలోనే కాదు తెలుగుదేశంలో కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఎవరెవరి మీద కేసులున్నాయో అధికారంలో ఉన్న మీకు తెలియదా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి సమాచారం తెప్పించుకోలేరా? అని కాంగ్రెస్ శాసనసభ్యుడు జెసి దివాకర రెడ్డి ఆవేశంగా ప్రశ్నించారు.