వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మణిపూర్లో పది మంది ఎన్కౌంటర్
హైదరాబాద్: కార్వాన్ శాసనసభ్యుడు సయ్యద్ సజ్జాద్ కు నివాళి తెలిపిన అనంతరం అసెంబ్లీ సోమవారం ఉదయం వాయిదా పడింది. దివంగత సజ్జాద్ గుణగణాలను కీర్తిస్తూ అన్ని పార్టీల శాసన సభాపక్ష నాయకులు ప్రసంగించారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొలుత ప్రసంగిస్తూ, సజ్జాద్ ప్రజా సమస్యల పట్ల ఎలా ప్రతిస్పందించేవారో వివరించారు.
అనంతరం సిఎల్పీ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి, బిజెఎల్పీ నాయకుడు హరిబాబు, సిపిఎం నాయకుడు నోముల నర్సింహయ్య, టిఆర్ ఎస్ నాయకుడు చంద్రశేఖర రావు, మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ సజ్జాద్ చేసిన మంచి పనులను గుర్తు చేశారు. అనంతరం సజ్జాద్ కు గౌరవ సూచకంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడింది.
Comments
Story first published: Saturday, September 13, 2003, 23:53 [IST]