కాన్షీరాంకు బ్రెయిన్ స్ట్రోక్
హైదరాబాద్: ప్రభుత్వ, ప్రతిపక్షాలు శాసనసభ వర్షాకాల సమావేశాల కోసం వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. రాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
నకిలీ స్టాంపుల కుంభకోణం, రాష్ట్రంలో ఐఎస్ఐ కార్యకలాపాలు, మంత్రులపై కేసులు, జల వివాదాలు, తదితర అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రతిపక్ష నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్రెడ్డి ఆదివారం ఇతర ప్రతిపక్షాల నేతలతో సమావేశమై అసెంబ్లీలో సమన్వయం కోసం ప్రయత్నాలు చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం కొందరు మంత్రులతో, సీనియర్ పార్టీ నేతలతో సమావేశమై ప్రతిపక్షాలను తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. ప్రజా సమస్యలను ప్రతిపక్షాలు రాజకీయం చేసి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తే తాము కూడా రాజకీయంగానే ఎదుర్కుంటామని రాష్ట్ర మంత్రి ఒకరు అన్నారు. రాజకీయ ఉద్దేశాలు లేకుండా వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మేలు జరుగుతుందని ఆయన అన్నారు.