వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్టెయిన్స్ కేసు: దారాసింగ్కు మరణశిక్ష
భువనేశ్వర్: గ్రాహమ్ స్టెయిన్స్, ఆయన ఇద్దరు కుమారుల హత్య కేసులో దారాసింగ్కు ఒరిస్సా కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో మరో 12 మందికి జిల్లా, సెషన్స్ జడ్జి మహేంద్ర నాథ్ పట్నాయక్ జీవిత ఖైదు విధించారు.
భువనేశ్వర్కు 400 కిలోమీటర్ల దూరంలో గల మనోహర్పూర్ గ్రామంలో 1999 జనవరి 22వ తేదీ రాత్రి ఒక గుంపు స్టెయిన్స్ను, ఆయన ఇద్దరు కుమారులను సజీవంగా దహనం చేసింది. ఈ కేసులో దారాసింగ్, మరో 12 మంది నేరం చేసినట్లు కోర్టు ఇటీవల ప్రకటించింది. వారికి సోమవారం శిక్షను ఖరారు చేసింది.
Comments
Story first published: Monday, September 22, 2003, 23:53 [IST]