వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్ఆర్ఐల యాక్షన్ గ్రూప్: వాజ్పేయి
న్యూయార్క్: కాశ్మీర్లో పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదంపై భారత వైఖరిని తెలియజేసేందుకు యాక్షన్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అమెరికాలోని భారతీయులకు సూచించారు. ఇది సమర్థవంతమైన లాబీ గ్రూప్గా పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్గ గురించి అర్థసత్యాలపై ఆధారపడి రాసే వ్యతిరేక, తప్పుడు వార్తలను సరిదిద్దేందుకు కూడా ఈ యాక్షన్ గ్రూప్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అమెరికాలోని భారతీయులను ఉద్దేశించి ఆయన సోమవారం ప్రసంగించారు. ఇతర దేశాల యాక్షన్ గ్రూప్లు చాలా అమెరికాలో పని చేస్తున్నాయని ఆయన గుర్తు చేస్తూ భారతీయులు యాక్షన్ గ్రూప్ను ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆశ్చర్యం ప్రకటించారు. పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని సరైన కోణంలో చూపించేందుకు ఇండియన్ యాక్షన్ గ్రూప్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, September 22, 2003, 23:53 [IST]