వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాస్‌పై చంద్రమోహన్‌ మండిపాటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు అడ్డుకుంటామని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ చేసిన హెచ్చరికపై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై సోమవారం పోలీసులు చేసిన లాఠీచార్జీకి ప్రతిస్పందిస్తూ శ్రీనివాస్‌ ఆ హెచ్చరిక చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను శ్రీనివాస్‌ తన సొంత జాగీర్‌గా పరిగణిస్తున్నారని చంద్రమోహన్‌ రెడ్డి మంగళవారంవిలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మాజీ పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావే ఉత్తమమనే విధంగా శ్రీనివాస్‌ ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. నకిలీ స్టాంపుల కుంభకోణంలో చాలా మంది ప్రమేయం ఉన్నదని శ్రీనివాస్‌ చేసిన ఆరోపణపై కూడా మంత్రి తీవ్రంగాప్రతిస్పందించారు.

ఆరోపణలకు రుజువులు చూపించాలని ఆయన శ్రీనివాస్‌ను డిమాండ్‌ చేశారు.అసెంబ్లీ సమావేశాలకు రాకుండా బయట ఉండి ఏది పడితే అది మాట్లాడడం శ్రీనివాస్‌కు మంచిది కాదని ఆయన అన్నారు. శ్రీనివాస్‌ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నవిషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X