నంద్యాలలో ఆర్డీవో ఆఫీసుపై దాడి
కర్నూలు/ అనంతపురం:శ్రీశైలం జలాల కోసం కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన మంగళవారం నంద్యాలలో విధ్వంసానికి దారి తీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు నంద్యాల ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. కొన్ని ఆర్టీసి బస్సుల అద్దాలు పగులగొట్టారు. ఇందులోపెద్ద యెత్తున మహిళలు కూడా పాల్గొన్నారు. ఇదిలావుంటే, కర్నూలు జిల్లా రైతు నాయకులు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఏడవ రోజుకు చేరుకున్నది. తమ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు.
సాగు, తాగునీటికోసం అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి)అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డిచేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఏడోరోజుకు చేరుకుంది. ఆయన చేత దీక్షనువిరమింపజేయడానికి ప్రజాసంఘాల ప్రతినిధులుప్రయత్నిస్తున్నారు. వీరు జిల్లా కలెక్టర్తో చర్చించిఅనంతరం అనంత వెంకట్రామిరెడ్డితోమాట్లాడారు. తమ ఆందోళనను ప్రభుత్వంపట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ నాయకులు వామపక్షాలమద్దతును సంపాదించే ప్రయత్నం చేస్తున్నాయి.వామపక్షాల నాయకులతో కాంగ్రెస్ నాయకులుసుదీర్ఘ చర్చలు జరిపారు. బుధవారం బహిరంగసభ జరుగుతుంది.