వెంకయ్యనాయుడికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్ఃబుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయంలో జరిగినవిమాన ప్రమాదం నుంచి బిజెపి జాతీయ అధ్యక్షుడు ఎంవెంకయ్య నాయుడు, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనాయకుడు ఎర్రన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిరాజీవ్ ప్రతాప్ రూడీ సురక్షితంగా బయటపడ్డారు.
హైదరాబాద్ -విజయవాడ మధ్య నేడే ప్రారంభమైనడెక్కన్ ఎయిర్ వేస్ విమానం రన్ వే మీదనడుస్తుండగా ఇంజన్ లో మొదట పొగ, తర్వాతమంటలు వ్యాపించాయి. వెంటనే కెప్టెన్ విమానంఇంజిన్ ను ఆపు చేశాడు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకిదిగి అప్పుడే రాజుకుంటున్న మంటలనుఆర్పివేశారు. ఈ విమానంలో ఇంకా పార్లమెంటు సభ్యుడుకె. రామమోహన రావు, బిజెపి ఎమ్మెల్యే సినీ నటుడు కోటశ్రీనివాస రావు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాతమంటలు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.
ఈ కొత్త విమానసర్వీసుకు అంతకు ముందు జరిగినప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా హాజరు కాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖసహాయ మంత్రి బండారు దత్తాత్రేయ జెండాఊపారు. చిన్న సాంకేతి లోపం వల్ల ఈ ప్రమాదంజరిగిందని , సోమవారం నుంచి విజయవాడకు ప్రతి రోజూవిమాన సర్వీసు ఉంటుందని డెక్కన్ ఎయిర్ వేస్ ఎండికెప్టెన్ గోపీనాధ్ చెప్పారు.