వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేర రాజకీయాలపై దుమారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నేరమయ రాజకీయాలపై చర్చ సందర్భంగా బుధవారం శాసనసభలో దుమారం చెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలకు, ప్రత్యారోపణలకు దిగారు. దీంతో చర్చ పక్కదారి పట్టింది. తెలుగుదేశం, కాంగ్రెస్‌ సభ్యులు గత చరిత్రలను తవ్వుకుని పరస్పరం నిందారోపణలకు దిగారు.

నేరమయ రాజకీయాలపై బిజెపి సభ్యుడుకె. హరిబాబు మంగళవారం చర్చను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆ దుమారం చెలరేగింది. నకిలీ స్టాంపుల కుంభకోణంపై నిందితులకు బెయిల్‌ లభించేలా కేసులు నమోదు చేశారేమోననే అనుమానాన్ని హరిబాబు వ్యక్తం చేశారు. నకిలీ స్టాంపులను గుర్తించే పద్ధతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉందా, లేదా అని ఆయన అడిగారు. నకిలీ స్టాంపుల కుంభకోణం దర్యాప్తులో ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించాల్సి వుండిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X