ఠాగూర్ తొక్కిసలాటలో ముగ్గురి మృతి
హైదరాబాద్: ఏడాది తర్వాత చిరంజీవి తాజా చిత్రంఠాగూర్ సినిమా విడుదల సందర్భంగా రాజమండ్రిలో ఒక థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు యువకులు మరణించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో థియేటర్ వద్ద మరో వ్యక్తి చనిపోయాడు. రాజమండ్రి పట్టణంలో ఈ సినిమా కటౌట్ పెడుతోన్న మరో యువకుడువిద్యుత్ తీగ తాకి మరణించాడు.
ఠాగూర్ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడడంతో రాజమండ్రిలో ఈ సినిమా విడుదలైన రెండు థియేటర్ల వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే జనం క్యూలలో నిలబడ్డారు. రంభ అనే థియేటర్లో టికెట్ల కోసం విపరీతమైన తొక్కిసలాటఏర్పడింది. దీంతో ఆరుగురు అపస్మారక స్థితికి గురయ్యారు.వీరిలో లక్ష్మణ్ (23), రవి కుమార్ (30) అనే ఇద్దరు యువకులు చనిపోయారు.
మరణించిన యువకులిద్దరూ నిరుపేద కుటుంబానికి చెందిన వారే. అటు గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ టికెట్ కోసం జరిగిన తొక్కిసలాటలో ప్రకాశం జిల్లాకు చెందిన జక్కయ్య అనే యువకుడు మరణించాడు.