వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ: మీటర్లపై కాంగ్రెస్‌ వాకౌట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: విద్యుత్‌మీటర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు బుధవారం శాసనసభ నుంచి వాకౌట్‌ చేశారు.మీటర్ల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం సభా సంఘం వేయడానికి నిరాకరించింది.

విద్యుత్‌ వినియోగదారులకు జరిమానాలు వేయడానికి ఉద్యోగులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారని, ఇదిసరైన విధానం కాదని కాంగ్రెస్‌ సభ్యుడు డి. నాగేందర్‌ అన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ లెజిస్టేచర్‌ పార్టీ(సిఎల్‌పి) వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి జోక్యం చేసుకునివిద్యుత్‌ మీటర్ల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.విద్యుత్‌ మీటర్ల కొనుగోలు వ్యవహారంపై సభా సంఘం వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలనువిద్యుత్‌ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఖండిస్తూ సభా సంఘానికి తిరస్కరించారు.అందుకు నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X