వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజలు కోరుకున్న చోటే ఆలయం
సోమనాథ్: ప్రజలు కోరుకున్న చోటనే రామాలయ నిర్మాణం జరగాలని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ అన్నారు. బాబ్రీ కూల్చివేత కేసు నుంచివిముక్తి లభించిన వారం రోజుల తర్వాత ఆయన అయోధ్యలో రామాలయ నిర్మాణంపైపెదవి విప్పారు. లక్షలాది మంది ప్రజలు కోరుకున్న చోటనే రామాలయ నిర్మాణం జరగాలని ఆయన అన్నారు.
అక్కడ రామాలయం ఎందుకు నిర్మించకూడదో తనకుఅర్థం కావడం లేదని ఆయన అన్నారు. గురవారంనాడువీరవల్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుడు సింగ్ రాణా చిత్రపటావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. కొందరు కోర్టు తీర్పు వచ్చే దాకా ఆగాలంటున్నారని, మరి కొందరు చట్టం తేవాలంటున్నారని, రామాలయ నిర్మాణానికి సంప్రదింపులే ఉత్తమ పరిష్కారం చూపగలవనేది తన అభిప్రాయమని ఆయన అన్నారు. ఇదిశాశ్వత పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, September 25, 2003, 23:53 [IST]