వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డిజిన్వెస్ట్మెంటుకు ప్రత్యామ్నాయాలు: శౌరి
న్యూఢిల్లీ: ప్రభుత్వ చమురు కంపెనీలు హెపిసిఎల్, బిపిసిఎల్లలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది. ఈ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణకు బ్రేక్ వేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది. పెట్టుబడుల ఉపసంహరణ క్యాబినెట్ కమిటీ సమీక్షకు కూడా నివేదించనుంది.
పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిఅరుణ్ శౌరి గురువారం న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఈవిషయమై చర్చించారు. ప్రభుత్వం వద్ద పలు ప్రత్యామ్నాయాలున్నాయనిఅరుణ్ శౌరి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అంశాలపై, వాటి పరిణామాలపై, అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలపై తాను జైట్లీ చర్చించామని, తాము ఈవిషయమై ఒక పత్రం రూపొందించి జైట్లీకి శుక్రవారం సమర్పిస్తామని ఆయన చెప్పారు. ఇద్దరు మంత్రుల మధ్య దాదాపుఅరగంట సేపు సమావేశం జరిగింది.
Comments
Story first published: Thursday, September 25, 2003, 23:53 [IST]