సెంటున్నా రాజకీయాలకు స్వస్తి: కోటగిరి
హైదరాబాద్: కొల్లేరు భూముల్లో తనకు ఒకసెంటు ఉన్నా రాజకీయాలకు స్వస్తి పలుకుతానని భారీ పరిశ్రమల మంత్రి కోటగిరి విద్యాధరరావు అన్నారు. మజ్లీస్ సభ్యుడుఅసదుద్దీన్ ఓవైసీ బుధవారంనాడు కొల్లేరు భూముల అన్యాక్రాంతంపై చేసిన ఆరోపణకు ప్రతిస్పిందిస్తూ మంత్రి గురువారం ఆ సవాల్ చేశారు.
తన పేరు కొల్లేరు భూమి ఉన్నట్లు రుజువు చేయకపోతేఅసదుద్దీన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఆయన అడిగారు. అలా చేయని పక్షంలోఅసదుద్దీన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి ఈ సవాల్ చేసినప్పుడుఅసదుద్దీన్ సభలో లేరు. దీంతో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జోక్యం చేసుకుని- కొల్లేరు భూముల అన్యాక్రాంతంపైవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాను కొల్లేరు భూముల అన్యాక్రాంతంపైవిచారణ జరిపించాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని విద్యాధర రావు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోవిచారణ జరిపించకపోవడం తప్పేనని, ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జి చేత గానీ సభా సంఘం చేత గానీవిచారణ జరిపిస్తే తప్పేమిటని రాజశేఖర్ రెడ్డి అన్నారు.