వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ ఇంటిలో క్షిపణులు
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని ఒక ఇంటి నుంచి పోలీసులు గురువారంనాడు మూడు క్షిపణులనుస్వాధీనం చేసుకున్నారు. జితేందర్ వ్యాస్ అనేట్రాన్స్పోర్ట్ ఏజెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
మూడు ఇజ్రాయెల్ తయారీ క్షిపణులనుట్రాన్స్పోర్టు ఏజెంట్ ఇంటిలోంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించిన కన్సైన్మెంట్ ఢిల్లీకి ఈ నెల 17వ తేదీన చేరింది. జైసల్మీర్ రక్షణ దళాలకుఅందజేయాల్సిన ఈ క్షిపణులను ట్రాన్స్పోర్టు ఏజెంట్ తన ఇంటిలో ఎందుకు ఉంచుకున్నాడనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గోదాముకు సంబంధించిన సమస్య ఉండడంతో క్షిపణులను తన ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చిందని అతను పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Thursday, September 25, 2003, 23:53 [IST]