వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్‌ బాస్‌ లేఖ ఫోర్జరీః అశోక్‌ గజపతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కోనసీమ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఒక విదేశీ కంపెనీ సిఇవోకు రాసినట్టు చెబుతున్న లేఖ ఫోర్జరీ అనిమంత్రి అశోక్‌ గజపతిరాజు శుక్రవారం అసెంబ్లీలో చెప్పారు.

కెనడాకు చెందినఓక్‌ వెల్‌ పవర్‌ ప్రాజెక్టును కోనసీమ పవర్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన లావాదేవీల్లో భాగంగా హైదరాబాద్‌ లోని బిగ్‌బాస్‌ కు మూడు కోట్ల రూపాయలు చెల్లించామని ఆ కంపెనీ డైరెక్టర్‌ తన కెనడా భాగస్వామికి రాసినట్టు చెబుతున్న లేఖను గురువారం కాంగ్రెస్‌ శాసనసభ్యుడు ఎంవి మైసూరారెడ్డి శాసనసభ ఎదుట ఉంచారు. 199 ఆగస్టు 27 న రాసినట్టు ఉన్న ఈ ఫోర్జరీ లేఖ కొత్తది కాదని, గతంలో ఒకసారి సర్క్యులేషన్‌ లోకి వచ్చిందనిఅశోక్‌ గజపతి రాజు సమాధానమిచ్చారు.

లేఖ ఫోర్జరీదా అసలైనదా అని చూసుకోకుండా కాంగ్రెస్‌ వారు ముఖ్యమంత్రిమీద ప్రభుత్వం మీద బురద చల్లడం మంచిది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వంమీది. పోలీసు యంత్రాంగం మీది. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యతమీదే. ఏ అంశం మీదనైనా 24 గంటల్లో చర్య తీసుకుంటానని ప్రకటించే ముఖ్యమంత్రి దీనిమీద కూడా వెంటనే చర్య తీసుకోవాలి అని మైసూరా రెడ్డికోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X