విశాఖ క్రికెట్ అభిమానులకు నిరాశే!
హైదరాబాద్ః నకిలీ స్టాంపుల కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోవిచారణ జరిపించడానికి తాము సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నేరమయ రాజకీయాలు, కుంభకోణాలపై మూడు రోజుల పాటుఅసెంబ్లీలో జరిగిన చర్చకు జవాబిస్తూ ఆయన ఈవిషయం వెల్లడించారు. నకిలీ స్టాంపుల కుంభకోణంపై సిబిఐ చేతవిచారణ జరిపించవలసిందిగా ఇప్పటికి నాలుగు సార్లు ఉప ప్రధాని అద్వానీకి లేఖలు రాశామని చంద్రబాబు నాయుడు చెప్పారు.
మహారాష్ట్రలో మూడు వేలకోట్ల రూపాయల నకిలీ స్టాంపులు అమ్ముడైనట్టు కేసులు నమోదు కాగా కర్నాటకలో ఇది 206 కోట్లని, ఆంధ్రప్రదేశ్ లో కేవలం తొమ్మిది కోట్లు మాత్రమేనని ఆయనవివరించారు. గత పదేళ్ళుగా పదహారు రాష్ట్రాల్లో నకిలీ స్టాంపులు చలామణి అవుతున్నయని, రాష్ట్రంలోవీటి వల్ల నష్టం ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలాస్వల్పమన్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని సంవత్సరాల వారీగా ఆయన గణాంకాలను సభలో చదివివిన్పించారు.
ఈ కుంభకోణంపై సిబిఐవిచారణకు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ అనేక పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన చదివివిన్పించారు. ఈ కుంభకోణంలో దోషులు ఎవరు ఉన్నా రక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్ళలో స్కాలర్ షిప్ ల స్కాంలో 27 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశామని,అందులో 13 మంది డిస్మిస్ కూడా అయ్యారని ఆయన చెప్పారు.