రాంనగర్ కుట్ర కేసు కొట్టివేత
హైదరాబాద్: రాంనగర్ కుట్ర కేసును హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు సోమవారం కొట్టేసింది. ఈ కేసు 18 యేళ్ల పాటు నడిచింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చివేయడానికి కుట్ర పన్నారంటూవిప్లవోద్యమ నాయకులు, విప్లవ రచయితలపై ఈ కేసు నమోదయింది.
ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ 1986లో 45 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో 17 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ 45 మందిలోవిప్లవోద్యమ నాయకులు కొండపల్లి సీతారామయ్య వంటి నక్సల్స్ నాయకులు, వరవరరావు, తదితరవిప్లవ రచయితలు ముద్దాయిలుగా ఉన్నారు. కొండపల్లిసీతారామయ్యపై 1995లో కేసు ఉపసంహరించుకున్నారు. పది మందిపై కేసుపెట్టారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో నిందితులు కొందరు మరణించారు. చివరికి వరవరరావు, సుధాకర్లు మాత్రమేమిగిలారు. కేసులో 600 మంది సాక్షులను విచారించారు.
తమను వేధించడానికే ఈ కేసు పెట్టారని తీర్పు వెలువడిన అనంతరం వరవరరావువిలేకరులతో అన్నారు. కోర్టు చుట్టూ తిప్పడానికి, తనను, తన కుటుంబ సభ్యులను వేధించడానికి ఈ కేసుపెట్టారని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టబద్దం కానప్పటికీ కుట్ర చేయడం న్యాయసమ్మతం, ధర్మమని పీస్ ఇన్షియేటివ్ కమిటీ కన్వీనర్ సుధాకర్ అన్నారు.