వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాజలాలపై అదే వేడి, అదే వివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కృష్ణా జలాలపై సోమవారం కూడా శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. కృష్ణాజలాలపై కాంగ్రెస్‌ ప్రాంతానికో విధమైన వైఖరినిఅనుసరిస్తోందని, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని తెలుగుదేశం పార్టీవిమర్శించింది.

తమ పార్టీ శాసనసభ్యులు తమ తమ ప్రాంతాల ప్రయోజనాల పరిరక్షణకు చేసే ప్రయత్నాలకు తాము అడ్డుపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. కృష్ణాడెల్టా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో నీటి కోసం సాగుతున్న ఆందోళనలను కాంగ్రెస్‌ సభ్యులు ఎత్తి చూపారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రసంగానికి కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డు తగిలారు. దీంతో వెంకటరెడ్డిపై శ్రీహరి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. దీన్ని కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం తెలియజేయడంతో మంత్రి తన వ్యాఖ్యను ఉపసంహరించుకున్నారు.

జలాల వినియోగంపై కాంగ్రెస్‌ వైఖరిని ప్రతిపక్షనాయకుడు డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డివివరించారు. తాను కోస్తాలోనూ, రాయలసీమలోనూఒకే రకంగా మాట్లాడినట్లు వచ్చిన వార్తల క్లిప్పింగులను ఆయన చూపించారు. ఈ సమయంలో జోక్యం చేసుకుని- వైయస్‌పై చంద్రబాబు నాయుడు తీవ్రంగావిమర్శలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X