వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది స్కామ్‌ల సర్కార్‌: శ్రీనివాస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రంలోని తెలుగు దేశం ప్రభుత్వాన్ని స్కామ్‌ల సర్కార్‌గా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అభివర్ణించారు. జన జాగరణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ ఆకాశవాణి కేంద్రం వద్ద మంగళవారం జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

ఏలేరు స్కామ్‌ నుంచి నకిలీ స్టాంపుల కుంభకోణం వరకు తెలుగుదేశం ప్రభుత్వం కుంబకోణాల్లో కూరుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్దేశ్యపూర్వకంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నకిలీ స్టాంపుల కుంభకోణంపై దర్యాప్తు సాగకుండా చేశారని ఆయనవిమర్శించారు.

నకిలీ స్టాంపుల కుంభకోణంలో కృష్ణా యాదవ్‌పై నాలుగేళ్ల క్రితమే కేసునమోదైందని, ఈ విషయం చంద్రబాబుకు తెలుసునని,అయినప్పటికీ కృష్ణా యాదవ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారని, తర్వాత ఇదేవిషయమై మంత్రి వర్గం నుంచి తొలగించారని ఆయన అన్నారు. నకిలీ స్టాంపుల కుంభకోణంలో మరి కొంత మంది ప్రమేయంపై వస్తున్న ఆరోపణలు నిజమేనని ఆయన అన్నారు.

ప్రభుత్వం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని ఆయన అన్నారు. భావసారూప్యం కలిగిన పార్టీలతో తాము కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగదేశం- బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X