వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జోషి రాజీనామాకు ప్రధాని తిరస్కృతి
న్యూఢిల్లీ: మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి మురళీ మనోహర్ జోషి రాజీనామాను ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి మంగళవారం తిరస్కరించారు. విధులకుహాజరు కావాల్సిందిగా వాజ్పేయి జోషిని ఆదేశించారు.
వాజ్పేయి నిర్ణయాన్ని జోషిఅంగీకరించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు రాజకీయ ఉద్దేశాలతో కూడిందని, ఇందులో నేర, నైతిక ప్రవర్తనకు సంబంధించినఅంశాలు ఇమిడి లేవని మురళీ మనోహర్ జోషి అన్నారు. బాబ్రీ కూల్చివేత కేసులో అభియోగాలు నమోదు చేయాలని రాయ్బరేలీ కోర్టు తీర్పు ఇవ్వడంతో జోషి తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత వాజ్పేయిని జోషీ సోమవారంనాడు కలిశారు.
Story first published: Tuesday, September 30, 2003, 23:53 [IST]