కోర్టు తీర్పును సవాల్ చేస్తాం: విహెచ్పి
లక్నో: బాబ్రీ కూల్చివేత కేసులో అభియోగాలు నమోదు చేయాలని రాయ్బరేలి కోర్టు ఇచ్చిన తీర్పును తాను, ఇతర నాయకులు సవాల్ చేయనున్నట్లువిశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) అంతర్జాతీయ అధ్యక్షుడుఅశోక్ సింఘాల్ చెప్పారు. అలహాబాద్ హైకోర్టులో తాము త్వరలో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన మంగళవారంవిలేకరులకు చెప్పారు.
అశోక్ సింఘాల్పైనే కాకుండా విహెచ్పి ఇతర నాయకులు గిరిరాజ్కిశోర్, విష్ణు హరి దాల్మియా, సాధ్వి రితంబరలపై అభియోగాలు నమోదు చేయాలని రాయ్బరేలీ కోర్టు తీర్పు వెలువరించింది.ప్రాథమిక సాక్ష్యాధారాల నివేదిక (ఎఫ్ఐఆర్)లో తమపై నిర్దిష్ట ఆరోపణలు లేనందున తమపై కేసే ఉండదని ఆయన సింఘాల్ అన్నారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్ను ఉమ్మడిగా దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. అయితే బిజెపి నాయకులు ఉమా భారతి,వినయ్ కతియార్లు కూడా ఇందులో ఉంటారా, లేదా అనేవిషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు.