వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసులను కిడ్నాప్ చేసిన వార్
అనంతపురం: నిషిద్ధపీపుల్స్వార్ నక్సలైట్లు అనంతపురం జిల్లాలో ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ను కిడ్నాప్ చేశారు. అనంతపురం జిల్లా రామగిరి మండలంపేరూరు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.
హనుమంతు అనే కానిస్టేబుల్ను నక్సలైట్లు వదిలేశారు. చందు అనే కానిస్టేబుల్ నక్సలైట్ల చెరలో ఉన్నాడు. దసరా మామూళ్ల వసూళ్ల కోసంపేరూరు సమీపంలోని క్వారీల వద్దకు వస్తున్నారనే సమాచారంఅందుకున్న నక్సలైట్లు మాటు వేసి పోలీసులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. అయితే నక్సలైట్ల డిమాండ్లు ఇంత వరకు తెలియరాలేదు. విడుదలైన హనుమంతు నుంచివివరాలు రాబట్టేందుకు ఉన్నతాధికారుల ప్రయత్నిస్తున్నారు. కిడ్నాప్ చేసిన పోలీసు కానిస్టేబుల్ను కర్ణాటక సరిహద్దులోని అడవుల్లోకి తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, September 30, 2003, 23:53 [IST]