మందుపాతర పేలుడుః చంద్రబాబుకు గాయాలు
తిరుపతి: తిరమలఅలిపిరి గెస్ట్ హౌస్ వద్ద బుధవారం సాయంత్రంనక్సలైట్లు మందుపాతర అమర్చి పేల్చారు. ఈ పేలుడునుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తృటిలో తప్పించుకున్నారు.చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి బొజ్జలగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు చదలవాడకృష్ణమూర్తి, రెడ్డివారి రాజశేఖర్ రెడ్డికి గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి కుడి భుజానికి ప్రధానంగాగాయాలయ్యాయి. వెంటనే ఆయనను తిరుపతిలోనిస్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు.
బుధవారంసాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటనజరిగింది. తిరుపతి ఎమ్మెల్యే చదలవాడకృష్ణమూర్తి, పుత్తూరు ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్రెడ్డిలకు మాత్రం తీవ్రంగా గాయపడగా, రాజశేఖర్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగాఉంది. తిరుపతిలో యాత్రికుల కోసం కొత్తగా నిర్మించినకాంప్లెక్సును ప్రారంభించడానికి తిరుపతి వెళ్ళిన ముఖ్యమంత్రికాన్వాయ్ తిరుమల రెండో ఘాట్ రోడ్డు వద్దకుచేరుకోగానే మందుపాతర పేలింది. తిరుమలలోనిబ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకువెళుతుండగా ఆయన కాన్వాయ్ లో పేలుడు సంభవించింది.
ముఖ్యమంత్రి కారువెనక భాగం పేలడంతో కారు ముందుకు వెళ్ళి ఓ చెట్టునుఢీకొంది. సీఎం ముందు సీట్లో కూర్చొని ఉండగా,వెనుక సీట్లో ఎమ్మెల్యేలిద్దరూ కూర్చొనిఉన్నారు. 4.20 నిమిషాలకు మందుపాతర పేలింది. ఒక్కసారిఅంతా అయోమయం. హాహాకారాలు. వెంటనే సెక్యురిటీసిబ్బంది అప్రమత్తమై సీఎం కారు వద్దకుచేరుకున్నారు. కారు వెళ్ళి చెట్టును ఢీకొనడంతోచంద్రబాబు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది. ప్రత్యేకఅంబులెన్స్ లో స్విమ్స్ కు తరలించారు.
ముఖ్యమంత్రికి జరిగినగాయాలు చూసి ఆయన మాతృమూర్తి విలిపిస్తుండడంఅందర్నీ కలిచివేసింది. తెలుగుదేశం పార్టీనాయకులు రామానాయుడు దగ్గరుండి చికిత్స తదితర కార్యక్రమాలనుపర్యవేక్షించారు. ఈ దుర్ఘటనను అన్ని రాజకీయ పక్షాలుఖండించాయి.