వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రమంతా రెడ్ అలెర్ట్, తనీఖీలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం నేపథ్యంలో రాష్ట్రమంతా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా నక్సల్స్ ప్రాబల్య ప్రాంతంలో పోలీసులుపెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించారు.
గురువారం గాంధీ జయంతి సందర్భాన్ని పురష్కరించుకొని, ఈ దుశ్చర్యకు నిరసనగా శాంతియాత్రలు నిర్వహించాలని రాష్ట్రమంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఘాతుకానికి నక్సల్స్ లోని ఏ దళం పాల్పడిందో తెలుసుకునేందుకు ఇంటిలెజిన్స్ ప్రయత్నిస్తోంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లోఈ సాయంత్రం నుంచే వాహనాల తనీఖీలు, సోదాలు ప్రారంభించారు.
Comments
Story first published: Wednesday, October 1, 2003, 23:53 [IST]