వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్కా ప్లానింగ్‌?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గత రెండు నెలలుగాపీపుల్స్‌ వార్‌ చడీచప్పుడు లేకుండా ఒకేసారి పెద్దఎత్తున విరుచుకుపడింది. ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకొని బుధవారంపేల్చిన మందుపాతర ఘటన వెనుక పక్కాప్లానింగ్‌ కన్పిస్తోంది. ప్లాఫ్‌ కెమెరాల ద్వారా క్లైమోర్‌ మైన్స్‌ ను ఉపయోగించుకొని మందు పాతరపేల్చారు.

బహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడువిచ్చేస్తారని ఊహించి నెల రోజుల నుంచే ఈవ్యూహాన్ని ఖరారు చేసుకొని వార్‌ ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. వైర్ల సాయంతో మందుపాతర పేల్చడం ఈ వాదనకు ఊతమిస్తోంది. వైర్లను భూమిలో పాతిపెట్టారు. వాటిపై గడ్డి కూడా మొలిచింది.

దీన్ని బట్టి కనీసం నెల రోజుల నుంచే ప్లాన్‌ చేసుకున్నారని తెలుస్తోందని చిత్తూరు పోలీసులు తెలిపారు. మరోవైపు, జామర్లపై హోంమంత్రి, డిజిపిలు పరస్పరవిరుద్దమైన ప్రకటనలు చేసినప్పటికీ, జామర్లు ఈ పర్యటనలో ఉపయోగించలేదని స్పష్టమౌతోంది.

చంద్రబాబు నాయుబు ఒకరోజు పర్యటన జరుపుతారని, ఒకరోజు పర్యటనలో జామర్లు ఉండవని వార్‌ ముందే ఊహించి పక్కా ప్లాన్‌ తోసీఎంను టార్గెట్‌ చేసుకొని మందుపాతర పేల్చారని స్పష్టమవుతోంది. ఇది ఇంటిలిజెన్స్‌ వైఫల్యమేనని అభిప్రాయం పూర్తిగా బలపడుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X