వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్ చెరలో కానిస్టేబుల్ కాల్చివేత?
హైదరాబాద్ః పీపుల్స్ వార్ నక్సలైట్లు మంగళవారం కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్ టి. చంద్రశేఖర్ ను కాల్చిచంపినట్టు ఇక్కడి డిజిపి ఆఫీసుకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. రామగిరి పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న తడిపిని చంద్రశేఖర్. తోట హనుమంతు అనే కానిస్టేబుళ్ళను వెంకటాపురం సమీపంలోని ఒక ఫ్యాక్టరీ వద్ద నక్సలైట్లు కిడ్నాప్ చేసి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు.
అడవిలో కాలినడకఅ మూడు గంటలసేపు తిప్పిన తర్వాత మంగళవారం సాయంత్రం హనుమంతును పొలీసులు విడిచిపెట్టారు. నక్సలైట్లు తీసుకెళ్ళిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ చాలా కాలంగా పీపుల్స్ వార్ హిట్ లిస్టులో ఉన్నట్టు తెలిసింది. నక్సలైట్లు లుంగీలు కట్టుకుని ఉన్నారని, తనతో ఎటువంటి సందేశం పంపలేదని విడుదలైన కానిస్టేబుల్ హనుమంతు చెప్పారు.
Comments
Story first published: Wednesday, October 1, 2003, 23:53 [IST]