వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుబ్రహ్మణ్యం దర్యాప్తు ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భద్రతా నిపుణుడుసి. సుబ్రహ్మణ్యం తన ఉన్నత స్థాయి దర్యాప్తును శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై నక్సలైట్లు చేసిన హత్యాప్రయత్నంపైవిచారణకు రాష్ట్ర ప్రభుత్వం సుబ్రహ్మణ్యంను నియమించినవిషయం తెలిసిందే. ఆయన తన విచారణను తిరుపతిలో మొదలుపెట్టారు.

తిరుపతిలో ఆయన అధికారులతో విస్తృత చర్చలు ప్రారంభించారు. దుర్ఘటనకు సంబంధించి అన్ని కోణాల నుంచి ఆయనవిచారణ జరుపుతారు. పేలుడుకు ముందటి, తర్వాతి పరిణామాలపైఅంచనాకు వచ్చేందుకు ఆయన పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. దాడిస్వభావం గురించి, దాడికి అవలంభించిన పద్ధతి గురించి ఒకఅంచనాకు వచ్చేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందనేది సుబ్రహ్మణ్యంఅంచనాగా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం తన నివేదికను ఒక రోజులో సమర్పించగలరని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X