వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సుబ్రహ్మణ్యం దర్యాప్తు ప్రారంభం
హైదరాబాద్: భద్రతా నిపుణుడుసి. సుబ్రహ్మణ్యం తన ఉన్నత స్థాయి దర్యాప్తును శుక్రవారం ప్రారంభించారు. ఈ నెల 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై నక్సలైట్లు చేసిన హత్యాప్రయత్నంపైవిచారణకు రాష్ట్ర ప్రభుత్వం సుబ్రహ్మణ్యంను నియమించినవిషయం తెలిసిందే. ఆయన తన విచారణను తిరుపతిలో మొదలుపెట్టారు.
తిరుపతిలో ఆయన అధికారులతో విస్తృత చర్చలు ప్రారంభించారు. దుర్ఘటనకు సంబంధించి అన్ని కోణాల నుంచి ఆయనవిచారణ జరుపుతారు. పేలుడుకు ముందటి, తర్వాతి పరిణామాలపైఅంచనాకు వచ్చేందుకు ఆయన పద్మావతి గెస్ట్హౌస్లో సమావేశం నిర్వహిస్తున్నారు. దాడిస్వభావం గురించి, దాడికి అవలంభించిన పద్ధతి గురించి ఒకఅంచనాకు వచ్చేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందనేది సుబ్రహ్మణ్యంఅంచనాగా తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం తన నివేదికను ఒక రోజులో సమర్పించగలరని భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, October 3, 2003, 23:53 [IST]