ఇంటి నుంచే బాబు ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన ఇంటి నుంచే ఆదేశాలు ఇస్తున్నారు. తనను సందర్శించడానికి వచ్చినప్పుడు అధికారులతో వారికి సంబంధించిన శాఖల వ్యవహారాలపై సూచనలు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది.
తనను పరామర్శించడానికి వచ్చే సందర్శకులతో ముఖ్యమంత్రి నివాసం కిటకిటలాడుతోంది. ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని రోజుకు రెండు సార్లు వైద్యులు పరీక్షిస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావువిలేకరులతో చెప్పారు. కడప జిల్లా రైతులు విత్తనాల కోసం చేస్తున్న ఆందోళన గురించి తనను సందర్శించడానికి వచ్చినప్పుడు సంబంధిత శాఖ అధికారులు వాకబు చేశారు.
రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులు ముఖ్యమంత్రిని శనివారం పరామర్శించారు.సిపిఎం, మజ్లీస్ నాయకులు చంద్రబాబును పరామర్శించారు.పీపుల్స్వార్ చర్యలు విప్లవానికి దోహదడపడేవి కావని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ముఖ్యమంత్రిపైనే హత్యాప్రయత్నం జరిగిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందోఅర్థం చేసుకోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.