లక్ష్మణ్కు చోటు- బంగర్కు ఉద్వాసన
ముంబాయి: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో జరిగే తొలి టెస్టుకు భారత జట్టులో హైదరాబాద్ ఆటగాడువి.వి.యస్. లక్ష్మణ్కు స్థానం లభించింది. భారత్, న్యూజిలాండ్ల మధ్య తొలి టెస్టు అహ్మదాబాద్లో ఈ నెల 8వ తేదీన ప్రారంభమవుతుంది.
న్యూజిలాండ్తో తలపడే 14 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) శనివారం ప్రకటించింది. ఓపెనర్ ఆకాశ్ చోప్రాకు, పేస్ బౌలర్లు ఆవిష్కార్ సాల్వి, లక్ష్మిపతి బాలాజీలకు జట్టులో స్థానం కల్పించారు. ఆల్ రౌండర్ సంజయ్ బంగర్కు ఉద్వాసన పలికారు. ముంబాయి లెగ్ స్పిన్నర్సైరాజ్ బహుతులే, పంజాబ్ బాట్స్మన్ యువరాజ్ సింగ్లకు కూడా చోటు లభించింది.
జట్టు
సౌరబ్ గంగూలీ (కెప్టెన్), సచిన్ టెండూల్కర్,వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ (వైస్ కెప్టెన్),వి.వి.యస్. లక్ష్మణ్, ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్, అనిల్ కుంబ్లే, హర్బజన్సింగ్, జహీర్ఖాన్, లక్ష్మీపతి బాలాజి, ఆవిష్కార్ సాల్వి,సైరాజ్ బహుతులే, యువరాజ్ సింగ్