వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబుకు కర్నాటక సిఎం పరామర్శ
హైదరాబాద్ఃనక్సలైట్ల దాడిలో గాయపడిన రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడిని కర్నాటక ముఖ్యమంత్రిఎస్ ఎం కృష్ణ, హర్యానా ముఖ్యమంత్రి ఓంప్రకాష్చౌతాలా శనివారం ఉదయం పరామర్శించారు.
తీవ్రవాదాన్నిఅణిచివేయడానికి రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలనిఎస్ ఎం కృష్ణ అభిప్రాయపడ్డారు. కర్నాటక ముఖ్యమంత్రికివిమానాశ్రయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసానిశ్రీనివాస యాదవ్ స్వాగతం పలికారు. నక్సలైట్లను ఎదుర్కోవడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరమని ఎస్.ఎం. కృష్ణ అన్నారు. ఇందుకు బహుముఖ వ్యూహం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నక్సలిజం తగ్గముఖం పట్టిందని, ప్రజల నుంచి నక్సలైట్లు దూరమవుతున్నారని ఆయన అన్నారు.
Story first published: Saturday, October 4, 2003, 23:53 [IST]