వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎంపై దాడికి టిడిఎఫ్ ఖండన
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు చేసిన దాడిని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడిఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు టిడిఎఫ్ ఒక ప్రకటన చేసింది.
ప్రజాస్వామిక వ్యవస్థలో తీవ్రవాదానికి చోటు లేదని తాము బలంగావిశ్వసిస్తున్నామని స్పష్టం చేసింది. ఏ విధమైన హింసనైనా నిరుత్సాహపరుస్తూ ప్రజాస్వామిక సంస్థల పట్ల ప్రజలవిశ్వాసం పెరిగేలా అన్ని చర్యలూ తీసుకోవాలని టిడిఎఫ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరింది. ప్రజాస్వామిక ప్రక్రియలను పటిష్టం చేసే దిశగా గట్టిగా కృషి చేయాలని టిడిఎఫ్ ప్రధాన స్రవంతి రాజకీయ వ్యవస్థలకువిజ్ఞప్తి చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని టిడిఎఫ్ ఆశించింది.
Comments
Story first published: Saturday, October 4, 2003, 23:53 [IST]