చికాగోలో ఆటా-2004మహాసభలు
హైదరాబాద్ఃఅమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘాల్లో ఒకటైనఅమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు 2004జులై రెండు నుంచి మూడు రోజుల పాటుచికాగోలో జరుగనున్నాయి. తెలుగు అసోసియేషన్ఆఫ్ గ్రేటర్ చికాగో (టిఎజిసి) సహకారంతో జరుగనున్న ఈ సమావేశాలకు వివిధ రంగాలకుచెందిన తెలుగు ప్రముఖులు హాజరవురవుతారని ఆటా పబ్లిక్రిలేషన్స్ కమిటీ కో-చైర్మన్ అమరేంద్రనెట్టెం దట్స్ తెలుగు డాట్ కాంకు పంపినమెయిల్ లో తెలియజేశారు.
టిఎజిసి గతనెల 27న చికాగోలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి ఆటానేషనల్ మెంబర్లు, టిఎజిసి స్ధానిక సభ్యులుహాజరయ్యారు. హన్మంత్ డి రెడ్డి,రమేష్ తుమ్మూరు, చంద్రశేఖర్ పి రెడ్డి,వెంకట కోడూరు, మూర్తి చిమటా, చంద్రారెడ్డి, ఇఫ్తెకార్షరీఫ్, శ్రీనివాస్ గౌడ్ గోపగాని తదితర ప్రముఖులు సమావేశానికివిచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఆటా కమ్యూనిటీ ప్రాజెక్టుల గురించి ఆటాఅధ్యక్షులు ఎవిఎన్ రెడ్డి వివరించారు. 2004 ఆటా సమావేశం కోసం టిఎజిసి చేస్తున్న కృషినివక్తలు ప్రశంసించారు. కాలిఫోర్నియా విక్టర్ విల్లేకుచెందిన శాంతి, ప్రేంరెడ్డి కుటుంబం, న్యూయార్క్సీరింగ్ టౌన్ కు చెందిన పైలా సాధన, మల్లారెడ్డి కుటుంబం ఆటాకు ఉదారంగావిరాళాలు ఇచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు.
స్ధానికఔత్సాహిక తెలుగు కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన అనంతరంఅచ్చ తెలుగు వంటకాలతో డిన్నర్ ఏర్పాటుచేశారు.