వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాలో పడవ మునిగి 29 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని నాగాయలంక వద్ద పడవ కృష్ణానదిలో మునిగిపోవడంతో 29 మంది మరణించారు. ఇప్పటి వరకు 16 మృతదేహాలను వెలికితీశారు.13 మంది జాడ తెలియడం లేదు. 59 మంది ప్రయాణికులతో బయలు దేరిన పడవ నాగాయలంకకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఈ మునిగిపోయింది.

ఇందులో ప్రయాణిస్తున్న 21 మంది ఈదుతూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

గొల్లలమంద నుంచి గొల్లల మూడికి ఈ పడవ వెళ్తుండగాప్రమాదం జరిగింది మృతుల్లో ల్లో ఎక్కువ మంది జాలర్లు, కూలీలే ఉన్నారు. ఇద్దరు పాఠశాల పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, నరసింహారావు సంఘటనా స్థలానికి హెలికాప్టర్‌ లో బయలుదేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X