వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అజిత్ జోగీపై సిబిఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి అజిత్ జోగీపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఫోర్జరీ కేసుకు సంబంధించి ఈ చార్జిషీట్ మంగళవారం దాఖలైంది.
అజిత్ జోగీ బోగస్ సర్టిఫికెట్ సంపాదించుకున్నారని భారతీయ జనతా పార్టీ నేత ప్రమోద్ మహాజన్ సోమవారం ఛత్తీస్ఘడ్ ఎన్నికల ప్రచారసభలో ఆరోపించారు. అజిత్ జోగీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం మంచిదని ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సూచించారు కూడా. అజిత్ జోగీపై మహాజన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
చత్తీస్ఘడ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను సోమవారంనాడే ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఈ స్థితిలో జోగీపై సిబిఐ చార్జిషీట్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది.
Story first published: Tuesday, October 7, 2003, 23:53 [IST]