వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్ జిల్లాలో నక్సల్స్ అరెస్టు
కరీంనగర్: నిషిద్ధపీపుల్స్వార్కు చెందిన నలుగురు నక్సలైట్లను కరీంనగర్ జిల్లా పోలీసులుఅరెస్టు చేశారు. వారి నుంచి రెండు మందుపాతరలను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్ వద్ద మంగళవారంనాడు ఈఅరెస్టు జరిగాయి.
తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులుశ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ ప్రాంతంలో అనుమానాస్సదంగా తిరుగుతున్న వారిని గమనించి అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయిన నక్సల్స్ను పి. గంగారామ్, కోలా లింగం, ముద్దం లింగం, బి. రాములులుగా గుర్తించారు. ఈ నలుగురు ఇటీవల జిల్లాలో ఒక విధ్వంసకర కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురిని పోలీసులు స్థానిక మెజిస్ట్రేట్ ముందుహాజరుపరిచారు. వారిని రెండు వారాల పాటు జ్యుడిష్యల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Story first published: Wednesday, October 8, 2003, 23:53 [IST]