పడవ ప్రమాదంపై విచారణ: బాబు
మచిలీపట్నం/విజయవాడ: కృష్ణా జిల్లా నాగాయలంక పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడువిచారణకు ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులైనవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన బుధవారం ఆదేశించారు.
గల్లంతయినవారి మృతదేహాల కోసం మంగళవారం రాత్రంతా గాలించారు. ఇంకా తొమ్మిది మంది శవాలు లభించాల్సి వుంది. గాలింపు కోసంవిజయవాడ, మచిలీపట్నం, గుంటూరుల నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. ఇప్పటివరకు 20 మంది శవాలను బయటకు తీశారు. అధికారులు గొల్లమంద గ్రామం వద్దే మకాం వేశారు.
పడవ నడిపుతున్న ముత్తేశ్వరరావు తాను ఈదుతూ ఒడ్డుకు చేరుకోలిగే పరిస్థితి ఉన్నప్పటికీ ఇతరులను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు వదిలాడు. అతడ్ని ఒకేసారిఅందరూ చుట్టుముట్టడంతో నీట మునిగిపోయాడు. మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయలేసిఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇందిరా ఆవాస్ యోజన కింద గృహవసతి కల్పించే యోచన కూడా చేస్తున్నారు.