వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పడవ ప్రమాదంపై విచారణ: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

మచిలీపట్నం/విజయవాడ: కృష్ణా జిల్లా నాగాయలంక పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడువిచారణకు ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులైనవారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆయన బుధవారం ఆదేశించారు.

గల్లంతయినవారి మృతదేహాల కోసం మంగళవారం రాత్రంతా గాలించారు. ఇంకా తొమ్మిది మంది శవాలు లభించాల్సి వుంది. గాలింపు కోసంవిజయవాడ, మచిలీపట్నం, గుంటూరుల నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. ఇప్పటివరకు 20 మంది శవాలను బయటకు తీశారు. అధికారులు గొల్లమంద గ్రామం వద్దే మకాం వేశారు.

పడవ నడిపుతున్న ముత్తేశ్వరరావు తాను ఈదుతూ ఒడ్డుకు చేరుకోలిగే పరిస్థితి ఉన్నప్పటికీ ఇతరులను రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు వదిలాడు. అతడ్ని ఒకేసారిఅందరూ చుట్టుముట్టడంతో నీట మునిగిపోయాడు. మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయలేసిఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇందిరా ఆవాస్‌ యోజన కింద గృహవసతి కల్పించే యోచన కూడా చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X