వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అది వైఎస్ బలహీనతః ఉమ్మారెడ్డి
హైదరాబాద్ః చంద్రబాబు నాయుడు నక్సలైట్ల దాడిలో గాయపడడం వల్ల ప్రజల్లో వస్తున్న సానుభూతి గురించి తాము ఆలోచించలేదని, ఈ సానుభూతి గురించి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడడం వారి బలహీనతను బయట పెడుతోందని తెలుగుదేశం ఎంపి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.
చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బుధవారం ఉదయం ఆయనవిలేకరులతో మాట్లాడారు. డాక్టర్లు చంద్రబాబు నాయుడిని విశ్రాంతి తీసుకోమని కోరారని,అయినా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ముఖ్యమంత్రి వారిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారని దీనివల్ల ఆయనకు వత్తిడి పెరుగుతున్న మాట వాస్తవమేనని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద రావుఅంగీకరించారు.
Comments
Story first published: Wednesday, October 8, 2003, 23:53 [IST]