వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్రావిడ్‌, జహీర్‌ జోరు, కివీస్‌ కష్టాలు

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: ద్రావిడ్‌ డబుల్‌సెంచరీ, గంగూలీ సెంచరీ, జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌ ప్రతాపం వల్ల కివీస్‌ జట్టు కష్టాల్లో పడింది. భారత్‌, న్యూజీలాండ్‌ ల మధ్య గురువారం జరిగిన రెండో రోజు మ్యాచ్‌ లో భారత్‌ ధాటిగా ఆడి 5వికెట్ల నష్టానికి 500 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ ను డిక్లేర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన కివీస్‌ జట్టును జహీర్‌ఖాన్‌ తన ఫాస్ట్‌ బౌలింగ్‌ ప్రతాపంతో కోలుకోలేకుండా చేశాడు. మార్క్‌ రిచర్డ్‌ సన్‌,స్టీవెన్‌ ఫ్లెమింగ్‌, విన్సెంట్‌ లను వెంటవెంటనేపెవిలియన్‌ దారి పట్టించాడు.

తొలి రోజు కివీస్‌ మూడువికెట్ల నష్టానికి 41 పరుగులు చేసి కష్టాల్లో పడింది. అంతకుముందు, ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 249 పరుగులతో ద్రావిడ్‌, లక్ష్మణ్‌ లు బ్యాటింగ్‌ ప్రారంభించారు. ద్రావిడ్‌ తన దూకుడును అదే విధంగా కంటిన్యూ చేస్తూ భారత్‌ స్కోర్‌ వేగాన్ని పెంచాడు. లక్ష్మణ్‌ తనస్టైలిష్‌ బ్యాటింగ్‌ తో అలరించినా, ఎక్కువ సేపు క్రీజ్‌ లో నిలవలేదు.

వెటోరి బౌలింగ్‌ లో 64 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. అనంతరం వచ్చినగంగూలీ దూకుడుగా ఆడుతూ..భారత్‌ స్కోర్‌ బోర్డును పరుగులెత్తించాడు. గంగూలీసెంచరీ పూర్తికాగానే తొలి ఇన్నింగ్స్‌ ను డిక్లేర్‌ చేశాడు. ద్రావిడ్‌ 222 పరుగులు చేశాడు. ద్రావిడ్‌ కిదిటెస్ట్‌ ల్లో మూడో డబుల్‌ సెంచరీ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X