వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలిపిరిని సందర్శించిన హోంమంత్రి

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడిపై అలిపిరి వద్ద హత్యాయత్నం జరిగిన వారం రోజుల అనంతరం తొలిసారిగా హోంమంత్రి దేవేందర్‌ గౌడ్‌ ఘటనాస్థలాన్ని సందర్శించారు. గురువారం సాయంత్రం ఆయన తిరుపతికి చేరుకొని..ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

పోలీసు ఉన్నతాధికారుల వెంట ఆయన ఆ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులు దాడి జరిగిన తీరునువివరించారు. దర్యాప్తులో పురోగతిని వివరించారు. అనంతరం ఆయనస్విమ్స్‌ లో చికిత్స పొందుతోన్న ఎమ్మెల్యే రెడ్డి వారి రాజశేఖరరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. చెన్నైలోనిఅపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మరో ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని కూడా ఆయన పరామర్శించారు.

తిరుపతిలో ఆయనవిలేకరులతో మాట్లాడుతూ..దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడే ఏవిషయం ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. ఇంటిలిజెన్స్‌ వైఫల్యమేనని సుబ్రమణ్యం దర్యాప్తు నివేదికలో సమర్పించినట్లువచ్చిన వార్తలను ప్రస్తావించగా..అంతా మీరే రాస్తున్నారు. ఇప్పటికీ దర్యాప్తు సాగుతోంది. దర్యాప్తు పూర్తయితేనే ఏవిషయం చెప్పగలమన్నారు. మీడియా ప్రతినిధులు దర్యాప్తు అధికారులకు సహకరించాల్సిందిగా ఆయనకోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X