వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నెలరోజుల్లో బాబు ఖతం: వార్
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నెలరోజుల్లోనే చంపుతామనిపీపుల్స్ వార్ గ్రూప్ తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. అలిపిరి వద్ద బాబు బయటపడ్డ ఈ సారి నెలరోజుల్లోనే చంద్రబాబును మట్టుబెడుతామని వార్ తాజాగా ఓ లేఖాస్త్రాన్ని సంధించినట్లు పోలీసులు తెలిపారు.
పీపుల్స్ వార్ రాసినట్లుగా చెపుతోన్న ఒక ఇన్ లాండ్ లెటర్ చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి గురువారం చేరింది.అందులో నెలరోజుల్లోనే చంద్రబాబును చంపుతామని రాసి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, ఈ లెటర్ నిజంగా వార్ రాసిందేనా కాదా అనేది నిర్ధారణకు రావాల్సి ఉందని ఆ వర్గాలు చెప్పాయి.
Comments
Story first published: Thursday, October 9, 2003, 23:53 [IST]