వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణాయాదవ్ రిమాండ్ పొడిగింపు
పుణఃహిమాయత్ నగర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రిసి.కృష్ణాయాదవ్ రిమాండ్ ను ఈ నెల 21 వరకుపొడిగించారు. నకిలీ స్టాంపుల కుంభకోణంలోనిందితుడైన కృష్ణాయాదవ్ గత నెల 27 నుంచి ఇక్కడి ఎరవాడ జైలులో ఉంటున్నారు. ఆయనను శుక్రవారం పుణ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచవలసి ఉండగా రక్షణ సిబ్బంది కొరత ఉందన్న కారణం చూపించి ఆయనను కోర్టుకు హాజరుపరచలేదు.
నేడుకృష్ణాయాదవ్ ను కోర్టుకు హాజరుపరుస్తారని,ఆయనకు బెయిల్ లభిస్తుందని ఆశించి ఆయనఅనుచరులు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తునఇక్కడికి తరలి వచ్చారు. కోర్టువద్ద ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో ఉండడంతో భద్రతా సమస్యలుతలెత్తుతాయని భావించినందు వల్లనేఆయనను కోర్టుకు హాజరు పరచలేదని తెలుస్తోంది.
Comments
Story first published: Thursday, October 16, 2003, 23:53 [IST]