వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోలుకోగానే ప్రజల్లోకి వెళ్తా:సీఎం
హైదరాబాద్: పూర్తిగా కోలుకోగానే తిరిగి ప్రజల్లోకి వెళ్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విధుల్లో చేరి, ఆ తర్వాత ప్రజల వద్దకు వెళుతానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు జిల్లాల నుంచిఅసంఖ్యాకంగా మహిళలు వస్తున్నారు. శనివారం తన నివాసానికి వరంగల్ తదితర జిల్లాల నుంచి వచ్చిన మహిళలనుద్దేశించి ఆయన మాట్లాడారు.
నా శరీరానికి గాయాలయ్యాయి. కానీ మనసుకు కాదు. రాత్రింబవళ్ళు కష్టపడిమీ రుణాన్ని తీర్చుకుంటానని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు శనివారం నాడు కూడా సమీక్షాసమావేశాల పరంపరను కొనసాగించారు.
ఐఎఐస్ అధికార్లలో భారీ మార్పలు చేపట్టేందుకు ఆయన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీటీడీ ప్రధాన భద్రతాధికారి ఇ.దామోదర్ ను బదిలీ చేశారు.
Comments
Story first published: Saturday, October 11, 2003, 23:53 [IST]