వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నీటి విడుదలపై సిఎఫ్టి అభ్యంతరం
హైదరాబాద్: రబీ పంటకు కోస్టాడెల్టాకు నీరిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనను తెలంగాణ కాంగ్రెస్(సిఎఫ్టి) ఫోరం నాయకులు తప్పు పట్టారు. ఈ ప్రకటన చేసి ప్రభుత్వం తెలంగాణ రైతులను మరోసారి మోసం చేస్తోందని సిఎఫ్టి నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆదివారంవిలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీటిని నిల్వ లేకుండా కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. కృష్ణాడెల్టాకు, కృష్ణా నది ఎడమ, కుడి గట్టు కాల్వల కింది భూములను నీరిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, నీటి నిల్వలు లేకుండా అది ఎలా సాధ్యపడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రైతులకు అన్యాయం తలపెడితే నీటిపారుదల శాఖ ఇంజనీర్లనుఘెరావ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Story first published: Sunday, October 12, 2003, 23:53 [IST]