వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కివీస్‌- భారత్‌ మ్యాచ్‌ డ్రా

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ను న్యూజిలాండ్‌ డ్రా చేయగలిగింది. నాథన్‌ ఆస్లే, మాక్‌మిల్లన్‌ జోడీని ఛేదించడంలో భారత బౌలర్లువిఫలం కావడంతో మ్యాచ్‌ డ్రా అయింది. ఏడో వికెట్‌ భాగస్వామ్యానికివీరిరువురు 103 పరుగులు జోడించి ఆజేయంగా నిలిచారు.

లంచ్‌ విరామ సమయానికి 86 పరుగులు మాత్రమే చేసి నాలుగువికెట్లు కోల్పోయిన కివీస్‌కు ఓటమి తప్పదనే అనిపించింది. అయితే ఆస్లే, మాక్‌మిల్లన్‌ న్యూజిలాండ్‌ను ఆదుకున్నారు. ఆదివారం చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆరువికెట్లు కోల్పోయి న్యూజిలాండ్‌ 272 పరుగులు చేసింది. మాక్‌మిల్లన్‌ 83 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. ఆస్లేఅర్థ సెంచరీ పూర్తి చేశాడు. డ్రాను తాము విజయంగా భావిస్తున్నామని న్యూజిలాండ్‌ కెప్టెన్‌స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వ్యాఖ్యానించాడు. తమ జట్టు ఆటతీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడు. భాతర స్పిన్నర్లు కుంబ్లే నాలుగువికెట్లు, హర్బజన్‌ సింగ్‌ రెండు వికెట్లు తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X