వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముందు ఎన్నికలకూ సిద్ధం: డిఎస్
హైదరాబాద్: గడువు కన్నా ముందుగానే ఎన్నికలు నిర్వహించినా తాముఅందుకు సిద్ధమేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై నక్సల్స్ చేసిన దాడి వల్ల వచ్చిన సానుభూతితో లబ్ధి పొందడానికి గడువు కన్నా ముందే ఎన్నికలు నిర్వహించాలనుకుంటే తాము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నామని ఆయన చెప్పారు.
బలహీనవర్గాల ఆధ్వర్యంలో ఆయనకు ఆదివారం సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వెనుకబడిన తరగుతలు ప్రతినిధి కాంగ్రెస్రాష్ట్రాధ్యక్షుడిగా రావడంతో తెలుగుదేశం పార్టీ బెంబేలెత్తుతోందని ఆయన అన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నమ్మడం లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు.
Comments
Story first published: Sunday, October 12, 2003, 23:53 [IST]