వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆయుధ పోటీలో లేము: వాజ్పేయి
న్యూఢిల్లీ: తమసైనిక సంసిద్ధత పూర్తిగా ఆత్మరక్షణ కోసమేనని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి స్పష్టం చేశారు. తాను ఆయుధాలు సమకూర్చుకుంటూ ఉపఖండంలో ఆయుధ పోటీని పెంచడానికి ఢిల్లీ పాకిస్థాన్ తప్పు పడుతోందని ఆయనవిమర్శించారు.
భారత్ తీసుకుంటున్న చర్యలన్నీ ఆత్మరక్షణ కోసమేనని, తాము ఎవరితోనూ ఆయుధాల పోటీలో లేమని, ఆయుధాలు సమకూర్చుకుంటున్నావారే తమను నిందిస్తున్నారని ఆయన అన్నారు. ఎనిమిది రోజుల ఇండోనేషియా, థాయ్లాండ్ల నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన ఆదివారంవిలేకరులతో మాట్లాడారు.
అయోధ్యలో రామసేవకుల ప్రజా చైతన్య ప్రచార యాత్ర శాంతియుతంగా జరుగుతుందనివిశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) ప్రకటన పట్ల ప్రధానివిశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిదీ శాంతియుతంగా జరుగుతుందని విహెచ్పి చెబుతోందని, వారి చెప్పిన మాటలపైవిశ్వాసం ఉంచడం అవసరమని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, October 12, 2003, 23:53 [IST]