వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దర్యాప్తులు పూర్తయ్యాకే మరిన్ని చర్యలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తిరుమలలోని అలిపిరి వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై జరిగిన దాడిపై దర్యాప్తులన్నీ ముగిసిన తర్వాతనే భద్రతా వైఫల్యాలపై మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రిపై దాడి తర్వాత మొదటిసారి సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. తన నివాసంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు.

తనపై దాడి తర్వాత చేపట్టిన భద్రతా యంత్రాంగంలోని మార్పులను ముఖ్యమంత్రి తన సహచరులకువివరించారు. ముఖ్యమంత్రిపై దాడికి ముందు, తర్వాత గల పరిణామాలను మంత్రివర్గం సమీక్షించింది.పీపుల్స్‌వార్‌ నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గం చర్చించింది. తనపై దాడి తర్వాత కొంత మంది మంత్రులు చేస్తున్న బహిరంగ ప్రకటనలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని మంత్రివర్గంవిజ్ఞప్తి చేసినట్లు సమావేశానంతరం సమాచార, పౌర సంబంధాల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డివిలేకరులకు చెప్పారు.

రాష్ట్రంలోని కరువు పరిస్థితులను మంత్రివర్గం సమీక్షించింది. మరో 11 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X