వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖాకీల లాఠీల ధాటికి వ్యక్తి మృతి
విజయవాడ: పోలీసులదెబ్బలకు విజయవాడలో ఒక వ్యక్తి మృతి చెందాడు. చుండూరు వెంకటేశ్వరరావు అనే వ్యాపారి పోలీసులుదెబ్బలకు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి.
పది రోజలు క్రితం అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్నాడనే ఆరోపణపై వెంకటేశ్వరరావును పోలీసులుఅరెస్టు చేశారు. ఆ తర్వాత వదిలేశారు. అయితే అతనికి ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. దీంతో అతడ్నివిజయవాడలోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతను అస్పత్రిలో మరణించాడు. పోలీసులదెబ్బలకే వెంకటేశ్వరరావు మరణించినట్లు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను రాజకీయ నాయకులు, వ్యాపారులు పరామర్శించారు.
Comments
Story first published: Monday, October 13, 2003, 23:53 [IST]