వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిత్రుల సహకారంతోనే మనుగడ: పిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) భాగస్వామ్య పక్షాల సహకారంతోనే తమ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకుందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారంవిలేకరులతో మాట్లాడారు.

సంకీర్ణ ప్రభుత్వం సమర్థంగా సాగడానికి సహకరించినందుకు ప్రధాని భాగస్వామ్య పక్షాల నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశం ప్రస్తుతం కీలక మార్పుల దశలో ఉన్నదని ఆయన చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలే తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించదని అనుకున్నారని, ఆఅంచనాలను తలకిందులు చేస్తూ ఎన్‌డిఎ పాలన సాగుతోందని ఆయన అన్నారు.

ఎన్‌డిఎ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్ర కార్యాలయంలో కూడా కార్యక్రమం జరిగింది. ఈ సభలో బిజెపి అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు ప్రసంగించారు. కాంగ్రెస్‌ను ఆయన దుయ్యబట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X